9 May, 2026 | 5:44 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

శబరిమలలో అయ్యప్ప స్వామిని సన్నిధిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

18-06-2025 12:00 AM

ఎల్లారెడ్డి, జూన్ 17 (విజయ క్రాంతి): కేరళ రాష్ట్రంలోని శబరిమలలో బంగారు కోవెలలో కొలువై వున్నా కలయుగ దైవం ధర్మశాస్త శ్రీశ్రీశ్రీశ్రీ. అయ్యప్ప స్వామిని మంగళవారం తెల్లవారు జామున కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు తన తనయుడు కార్తీక్ రావు తో కలిసి, దాదాపు 7కిలోమీటర్ల చిన్నపాదం కొండ కు కాలినడకతో వెళ్లి దర్శించుకున్నారు. కేరళ ట్రావెన్ కోర్ సంస్థానం అధికారులు ప్రోటో కాల్ ప్రకారం దర్శనం కల్పించారు.

సోమవారం రాత్రి శబరిమల కొండకు కాలి నడకన చేరుకున్న ఎమ్మెల్యే, రాత్రి స్వామిని ఒకసారి దర్శించుకొని, మళ్ళీ మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో  ఎమ్మెల్యే అయ్యప్పను దర్శించుకున్నారు. అక్కడి నుండి మళ్ళీ కాలినడకనే కొండా దిగి అయ్యప్ప స్వామి పెరిగిన ప్రాంతం అయినా పండాలని రాజ్యానికి వెళ్లి అక్కడి నుండి హైదరాబాద్  తిరుగు ప్రయాణం అయినట్లు ఎమ్మెల్యే మదన్మోహన్రావు విజయక్రాంతి ప్రతినిధితో తెలిపారు.