26-06-2025 12:38:12 AM
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఎమర్జెన్సీ ద్వారా అప్పటి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాం గ్రెస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను, ప్ర జల హక్కులను, ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ విమర్శించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించా రు.
ప్రతిపక్షాలను అణచివేసి తమ కుటుంబం మాత్రమే అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో అత్యంత నిరంకుశంగా వ్యవహరించారని తెలిపా రు. ఎమర్జెన్సీ రోజులను చీకటి రోజులుగా, రాజ్యాంగ హత్యా దినంగా పరిగణిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి 3 రోజుల పాటు ఫొటో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని తెలిపారు.