ఎములాడ..జనవాడ
11-06-2024 12:10 AM
రాజన్న సిరిసిల్ల, జూన్10 (విజయక్రాంతి) : ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో జనసంద్రంగా మారింది. పాఠశాలలకు సెలవులు ముగుస్తున్న సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి దాదాపు౭ గంటల సమయం పట్టింది.






