12-06-2025 01:42:58 AM
- ఇద్దరు మావోయిస్టులు మృతి
- మృతుల్లో ఒకరు మహిళా మావోయిస్టు
- మరణించిన మావోయిస్టు తలపై రూ. 5 లక్షల నజరానా
చర్ల, జూన్ 11 (విజయక్రాంతి): ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. జిల్లాలోని కుకనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పుస్గున్న ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టుతో సహా మరొకరు మరణించినట్టు పోలీసులు తెలిపారు.
మరణించిన ఇద్ద రు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీ నం చేసుకున్నారు. మావోయిస్టు క్యాడర్లు ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేర కు కుకనార్ పోలీస్ స్టేషన్ దళాలు, సుక్మా డీఆర్జీ దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి.. ఇద్దరు మావోయిస్టు లను మట్టుబెట్టాయి. ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య అనేకసార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మరణించిన మావోయిస్టులలో ఒకరిని పెడరస్ ఎల్ ఓ ఎస్ (లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్) కమాండర్ బామన్గా గుర్తించారు.
అతని తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న మహిళా నక్సలైట్ మృతదేహాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఘటనా ప్రాం తం నుంచి ఇన్సాస్ రైఫిల్, 12 బోర్ రైఫి ల్స్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం చుట్టూ ఉన్న దట్టమైన అడవు లను ఉపయోగించుకుని తప్పించుకున్న ఇతర మావోయిస్టుల కోసం వెతకడానికి అదనపు దళాలను మోహరించారు, ఈ ప్రాంతంలో ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
సరెండర్ ఒక్కటే మార్గం
బస్తర్ ఐజీ సుందర్ రాజన్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావాలని.. మావోయిస్టు పార్టీలో అగ్ర నాయకులైన గణపతి, దేవ్జీ, హిడ్మా, సుజాత బార్సే దేవా, ఇతర కేడ ర్లు లొంగిపోవటమే శరణ్యమని లేదంటే కగార్ ఆపరేషన్లో బలవక తప్పదని హెచ్చరించారు. మావోయిస్టులు హింస ను విడిచిపెట్టి సమాజంతో కలిసి పోవాలని సూచించారు. లొంగిపోకపోతే పరి ణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు పోలీసు ఎన్కౌంటర్లో హతమయ్యారని పేర్కొన్నారు.