భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఎండోమెంట్ కమిషనర్
08-12-2024 03:52 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రామలయంలో ఉన్నటువంటి లడ్డు, పులిహోర తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే మిథిలా ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున షెడ్డును కూడా ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి, ఈఈ రవీంద్ర, ఏఈఓ శ్రవణ్ కుమార్, ఏఈఓ భవాని రామకృష్ణ, సిబ్బంది, వేద పండితులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.






