17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్

17-04-2026 01:50 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 మంది సీనియర్ సివిల్ జడ్జిలను బదిలీ

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు

హుజూర్ నగర్, ఏప్రిల్ 17: భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎన్ శ్యామ సుందర్ ను హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇంతకు ముందు హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన రాధాకృష్ణ చౌహాన్ పదోన్నతిపై బదిలీ కాగా అప్పటి నుండి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పోస్టు ఖాళీగా ఉండగా కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ ఇన్చార్జి జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. దీనితో ఖాళీగా ఉన్న సీనియర్ సివిల్ జడ్జి పోస్టును హైకోర్టు భర్తి చేసింది. ఈనెల 25లోపు నూతన న్యాయమూర్తి తన బాధ్యతలను  స్వీకరించాలని ఆ ఉత్తర్వులలో హైకోర్టు  రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 మంది సీనియర్ సివిల్ జడ్జిలను తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.