26 April, 2026 | 9:15 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

వినోదాల బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

13-07-2025 12:53 AM

దీక్షిత్ శెట్టి హీరోగా, బృందా ఆచార్య హీరోయిన్‌గా అభిషేక్ ఎం దర్శకత్వంలో రూపొండుతున్న తెలుగు-, కన్నడ ద్విభాషా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. శ్రీదేవి ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై హెచ్‌కే ప్రకాశ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది. శనివారం మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. బ్యాంక్ దోపిడీకి వెళ్లిన హీరో గ్యాంగ్‌కు అక్కడ రూ. 67 వేలు మాత్రమే దొరుకుతాయి. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే ఆసక్తి రేకెత్తించేలా టీజర్‌లో వినోదాత్మకంగా రూపొందించారు. దీక్షిత్ శెట్టి కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. దీక్షిత్‌తో బృందా కెమిస్ట్రీ ఆకర్షణీయంగా ఉంది. ఈ చిత్రానికి సం గీతం: జుధాన్ శ్యాండీ; డీవోపీ:అభిషేక్ జే;ఎడిటర్: తేజస్