13-07-2025 12:51:42 AM
వైవిధ్యమైన కంటెంట్తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్న ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీ లివ్ తాజాగా మరో విభిన్న వెబ్ సిరీస్తో అలరించటానికి సిద్ధమవుతోంది. అదే ‘మయసభ’. ‘రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ అనేది ట్యాగ్లైన్. ఇందులో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డి పాత్రలో చైతన్యరావు, ఐరావతి బసు పాత్రలో దివ్య దత్తా నటించారు. దేవా కట్టా, కిరణ్ జయకుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ బ్యానర్లపై విజయ్కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు.
ఈ సిరీస్ సోనీ లివ్లో ఆగస్ట్ 7 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ సిరీస్ ట్రైలర్ను విడుదల చేశారు. ఇద్దరు గొప్ప స్నేహితులు.. అయితే వారి రాజకీయ ప్రస్థానాలు వారి మధ్య తెలియని దూరాన్ని పెంచాయి. మానసికంగా ఎంత దగ్గరి వారైనా రాజకీయ చదరంగంలో ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకోక తప్పలేదు. అలాంటి ఇద్దరు స్నేహితుల కథే ఇది. ప్రతి సన్నివేశంలో ఓ ఎమోషన్, ఫ్రెండ్ షిప్, ఎత్తుకు పై ఎత్తులు వేసే రాజకీయ చదరంగం.. ఎదుర్కొన్న ఆటు పోట్లు అన్నింటినీ దేవా కట్టా టీజర్లో అద్భుతంగా ఆవిష్కరించారు. టీజర్లోని డైలాగులు బాగా కనెక్ట్ అవుతున్నాయి.