26-06-2025 12:00:00 AM
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్కుమార్ హాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆమె ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన నటిస్తున్నారు. వెటరన్ దర్శకుడు చంద్రన్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీలంకలో చిత్రీకరించారు. ‘రిజానా: ఏ కేజ్డ్ బర్డ్’ అనే టైటిల్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కథ ఒక వాస్తవ ఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది. దక్షిణాసియా, అంతర్జాతీయ సినిమా మధ్య ఒక హిస్టారికల్ కొలాబరేషన్గా నిలవబోతున్న.
ఈ ప్రాజెక్ట్లో భాగం కావటం పట్ల వరలక్ష్మి శరత్కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ.. “ఆస్కార్ అవార్డు గెలుచుకున్న జెరెమీ ఐరన్స్ వంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నిజంగా ఒక కల నెరవేరినట్టు అనిపిస్తోంది. లయన్ కింగ్ సినిమాలో స్కార్ పాత్రకు ఆయనే వాయిస్ ఇచ్చారు.
ఆ సినిమా నాకు ఇష్టం. అన్ని డైలాగులు పక్కా గుర్తుండిపోయేంతగా చూశాను. ఇప్పుడా సినిమాకు వాయిస్ ఇచ్చిన ఆయనతో నేను నటించడం అనేది ఒక గొప్ప అవకాశం. చంద్రన్ రత్నం దర్శకత్వంలో పనిచేయడం కూడా నాకు గర్వకారణం.
శ్రీలంకలోనే కాదు, ప్రపంచ సినిమాకే ఆయన కొత్తదారులు చూపిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన అంతర్జాతీయ స్టార్స్తో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికినందుకు ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్లో మరిచిపోలేని ఒక మైలురాయి” అన్నారు.