06-06-2025 12:07:09 AM
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థలలో గురువారం విద్యార్థులతో కలిసి పలు అంశాలపై అవగాహన కల్పించారు. కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల ప్రెసిడెంట్ జస్టిస్ నరసింహరెడ్డి ఆధ్యర్యంలో నిర్వహించారు. ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. యువత దేశాన్ని ప్రగతి పథంలోనే కాదు కాలుష్య రహిత పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రముఖ పాత్ర పోషించాలి అన్నారు.
ప్రతి విద్యార్థి తమ పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కని నాటి దాన్ని సంరక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యర్థ పదార్థాలతో ఆర్ట్ వర్క్ చేసి విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ శ్రీధర్రెడ్డి, డైరెక్టర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ శాంతి, కళాశాల అధ్యాపక సిబ్బంది మొక్కలను నాటారు.