calender_icon.png 25 June, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని రంగాల్లో.. అభివృద్ధి పథంలో..

06-06-2025 12:06:37 AM

కామారెడ్డి, జూన్ 05,(విజయ క్రాంతి) : కేంద్రంలో నరేంద్ర మోదీ  ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం - సంకల్ప సహకారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కార్యశాల నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కిసాన్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి మాట్లాడుతూ దేశం నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుండి అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. ఈ 11 సంవత్సరాలలో భారత్ 3 వ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందిందని అన్నారు. డిఫెన్స్ విభాగంలో అత్యంత పటిష్టంగా మారిందని ఆపరేషన్ సింధూర్ దీనికి ఉదాహరణ అని అన్నారు.

దౌత్య పరంగా ఇప్పుడు భారత అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా బలమైన మిత్ర పక్షంగా ఎదిగిందని అన్నారు. ఇంటా బయట అందరి మన్ననలు పొంది భారత్ ను విశ్వగురువుగా తీర్చిదిద్దే ప్రయత్నం లో నరేంద్ర మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని బూత్ స్థాయిలో అందరికీ వివరించే విధంగా రాష్ట్ర శాఖ కార్యక్రమాల రూపకల్పన చేసిందని వాటిని గ్రామ స్థాయిలో నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు BB పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణా తార, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, పైలా కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు,రాము అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, లింగారావు నాయకులు వేణు, సంతోష్ రెడ్డి, బాల్ రాజు, అనిత, సంధ్య, తదితరులు పాల్గొన్నారు