05-06-2025 07:08:00 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు దాటి చెట్లుగా ఎదిగేందుకు కృషి చేయాలని కాళోజీ వాకర్స్ అసోసియేషన్(Kaloji Walkers Association) గౌరవ అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచం మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకుంటోందని, నీరు, గాలి నేల కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వెంకటరెడ్డి, మైసా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పట్టాభి లక్ష్మయ్య కోశాధికారి సోమ విష్ణువర్ధన్, వేముల రవీందర్, హట్యా నాయక్, పెద్ది వెంకన్న, బావ్ సింగ్, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, రామకృష్ణారావు, శ్రీహరి, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.