05-06-2025 07:24:30 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని మామున మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) గురువారం మొక్కలు నాటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండి వర్షాలు సమృద్ధిగా కురవాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలను పెంచాలని గ్రామస్తులకు సూచించారు. తెలంగాణ ప్రజా పనుల ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రత్న కళ్యాణి తాసిల్దార్ శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు