calender_icon.png 7 June, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

06-06-2025 01:15:11 AM

సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్

తిమ్మాపూర్, జూన్ 5 (వికయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ ఆధ్వర్యంలో ఎల్.ఎం.డి కాలనీలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో జడ్జి మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు కార్బన్ డై యాక్సైడ్ ను గ్రహించి మన జీవితానికి కావలసిన ఆక్సిజన్ ని అందిస్తాయని తెలిపా రు. ప్రతి మనిషి ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించాలని, వృక్షో రక్షిత రక్షితః వృక్షాలను మనం రక్షిస్తే మనల్ని వృక్షాలు రక్షిస్తాయని అన్నారు.

వాతావరణంలో వస్తున్న అనేక మార్పులకి మానవజాతి వృక్షాలను నిర్లక్ష్యం చేయడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. పర్యావరణ, గృహహింస, మోటారు వాహనాల చట్టాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మహిళా శిశువికాస కేంద్రం జిల్లా మేనేజర్ వి. సుధారాణి, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు అవుదరి కిరణ్ కుమార్, నిర్వాహకులు, సిబ్బందిపాల్గొన్నారు.