calender_icon.png 6 June, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మ పేరుతో మొక్క నాటండి

06-06-2025 01:14:28 AM

కేంద్రమంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): వాతావరణ మార్పులపై పోరాటానికి, భవిష్యత్తు తరాల పరిరక్షణకు మొక్కలు నాట డమే శరణ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. దేశ ప్రజలంతా తమ తల్లి పేరుతో ఒక్కో మొక ్కను నాటి, పర్యావరణ పరిరక్షణకు పాటుపాడాలని కోరారు. ప్రపంచ పర్యావరణ పరిర క్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం న్యూఢిల్లీ జంతర్‌మంతర్‌లోని తన అధికారిక నివాసంలో కేంద్రమంత్రి మొక్క లు నాటారు.

తన కార్యాలయ సిబ్బందితో మొక్కలు నాటించారు. మొక్కల పెంపకాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. జీవ వైవిధ్య పరిరక్షణ, భవి ష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు.

అందులో భాగంగా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగితోపాటు ప్రతీ భారతీయ పౌరుడు ‘ఏక్ పేడ్ మా కే నామ్’ నినాదంతో తమ తల్లి పేరుతో ఒక్కో మొక్కను నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభమవుతుందని, తల్లుల అనురాగానికి, పోషణకు గుర్తుగా మొక్కలు నాటడం ఒక అర్థవంతమైన నివాళి అవుతుందని చెప్పారు.