28 August, 2026 | 2:09 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి

03-07-2026 09:35 PM

ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి)అదిబట్ల సర్కిల్ పరిధిలోని బొంగ్లూర్ లో ఇంటెన్సివ్ రివిజన్ (సార్) కార్యక్రమాన్ని అధికారులు  ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేసే ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్ఓ)  శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. స్వయంగా ఓటరును కలిసి ఎన్యుమరేషన్ ఫారమ్‌ను అందజేసి, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అలాగే ఫారమ్‌ల పంపిణీ, నమోదు వివరాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంటికి చేరుకుని అర్హులైన ఓటర్లందరికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌లు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హత కలిగిన ఓటరికి ఎన్యుమరేషన్ ఫారమ్‌లు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.