14 June, 2026 | 5:02 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్

14-06-2026 03:49 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గంలోని  దస్తూరాబాద్ మండలం ఎర్రగుంట సర్పంచ్ భూక్య పద్మ కల్యాణ్ ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.