17 June, 2026 | 12:16 PM

Breaking News

ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •  

ప్రజల భాగస్వామ్యంతో ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తాము

19-12-2025 09:57 PM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ లో ఇందిరమ్మ కాలనీ పేస్ వన్, పండ్ల మార్కెట్ రోడ్డు, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్ కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీలా నిర్మాణ పనులకు సుమారు 2 కోట్ల 70 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు డివిజన్లో ప్రజలతో స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడారు.

గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రతి కాలనీని అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఏనుమాముల గ్రామంలో శివాలయలింగము, బొడ్రాయి పున ప్రతిష్ట కార్యక్రమలకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఇందిరమ్మ కాలనీ పేస్ వన్ లో ప్రధాన సమస్యగా ఉన్న స్మశాన వాటిక, రేషన్ షాప్, అంగన్వాడి, ఇంటి నెంబర్ల, ఇళ్ళపట్టాలు తదితర సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.