11 April, 2026 | 3:15 PM

Breaking News

జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •   ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కరించండి   •   పేదల అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •  

ప్రజల భాగస్వామ్యంతో ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తాము

19-12-2025 09:57 PM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ లో ఇందిరమ్మ కాలనీ పేస్ వన్, పండ్ల మార్కెట్ రోడ్డు, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్ కాలనీలలో అంతర్గత రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీలా నిర్మాణ పనులకు సుమారు 2 కోట్ల 70 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు డివిజన్లో ప్రజలతో స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడారు.

గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రతి కాలనీని అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఏనుమాముల గ్రామంలో శివాలయలింగము, బొడ్రాయి పున ప్రతిష్ట కార్యక్రమలకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఇందిరమ్మ కాలనీ పేస్ వన్ లో ప్రధాన సమస్యగా ఉన్న స్మశాన వాటిక, రేషన్ షాప్, అంగన్వాడి, ఇంటి నెంబర్ల, ఇళ్ళపట్టాలు తదితర సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.