1 August, 2026 | 4:19 PM

Breaking News

విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •   జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా   •   ఉదయం 11 గంటల నుండి నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి వరద   •   రాజంపేటలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఆత్రం సుగుణక్క   •   స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి   •  

వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు

19-12-2025 10:00 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని తిరుమల్ నగర్ శ్రీ నిలయంలో మయూరగిరి పీఠాధిపతులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు నములకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాదేవి లోకానికి అందించిన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తూ ఈ శ్రీ వ్రతాన్ని ఆచరించిన వారికి సుఖసంపదలు సకల సౌభాగ్యాలు కలిగి మనశ్శాంతి ఆరోగ్యం ఉంటుంది.

ప్రజలలో ప్రేమాభిమానాలు పెరుగుతాయని, దుష్ట ప్రవర్తన దూరమవుతుందని, సమాజ శ్రేయస్సు కలుగుతుందని అన్నారు. గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని లోకానికి అందించిందని అన్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము భజనలు చేసి తీర్థప్రసాదనాలు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనా పారాయణం, తిరుప్పావై వైభవం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.