11 April, 2026 | 1:17 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు

19-12-2025 10:00 PM

ముకరంపుర,(విజయక్రాంతి): నగరంలోని తిరుమల్ నగర్ శ్రీ నిలయంలో మయూరగిరి పీఠాధిపతులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు నములకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాదేవి లోకానికి అందించిన ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేస్తూ ఈ శ్రీ వ్రతాన్ని ఆచరించిన వారికి సుఖసంపదలు సకల సౌభాగ్యాలు కలిగి మనశ్శాంతి ఆరోగ్యం ఉంటుంది.

ప్రజలలో ప్రేమాభిమానాలు పెరుగుతాయని, దుష్ట ప్రవర్తన దూరమవుతుందని, సమాజ శ్రేయస్సు కలుగుతుందని అన్నారు. గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని లోకానికి అందించిందని అన్నారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము భజనలు చేసి తీర్థప్రసాదనాలు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనా పారాయణం, తిరుప్పావై వైభవం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.