calender_icon.png 13 June, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి నీటిబొట్టును నిల్వ చేయాలి

11-06-2025 12:00:00 AM

  1. సాగు,త్రాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి 

వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలి

కేంద్ర పెట్రోలియం, సహజ వనరులు, గ్యాస్ సంయుక్త కార్యదర్శి వినోద్ శేషన్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ప్రతి వర్షపు నీటిబొట్టుని నిల్వ చేసి.. సాగునీటి, త్రాగునీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర పెట్రోలి యం, సహజ వనరులు, గ్యాస్ సంయుక్త కార్యదర్శి వినోద్ శేషన్ అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ రెడ్డి భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి నీటిపారుదల, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సాగునీటి వనరుల రక్షణ, నీటి వినియోగం, త్రాగునీటి వనరుల ద్వారా ఇంటింటికీ నీరు అందించడం, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు శుద్ధమైన జలాన్ని సరఫరా చేయడం అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం, సహజ వనరులు, గ్యాస్ సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ..

జిల్లాలో ఉన్న తాగునీటి వనరుల ద్వారా సాగు భూములకు నీటిని అం దించాలని, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. సాగునీటి వనరుల ద్వారా వ్యవసాయ రంగ మే కాకుండా మత్స్య సంపదను పెంపొందించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించేం దుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామం లో ఇంటింటికి, అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు శుద్ధమైన జలాన్ని అందించాలని, ప్రతి వర్షపు నీటిబొట్టుని నిల్వ చేయా  లని తెలిపారు. జగన్నాధపూర్ ప్రాజెక్టు పెండింగ్ పనులపై నీటిపారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని నివే దిక రూపొందించి అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..

జిల్లాలో 1 భారీ నీటిపారుదల ప్రాజెక్టు, 3 మధ్య తరహా ప్రాజెక్టులు, 574 చెరువులు, కుంటలు, 13 లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి నీటిబొట్టును రక్షించేందుకు పర్కులేషన్ ట్యాంకులు, ఫారం పాండ్లు ఏర్పాటు చేస్తున్నామని, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామానికి, ఇంటింటికి, అంగన్వాడి కేంద్రాలకు, పాఠశాలలకు శుద్ధ జలాన్ని అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నామ ని తెలిపారు.

అంతకుముందు కేంద్ర బృందం గుండి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఇండ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు శుద్ధ జలం అందిస్తున్న తీరును పరిశీ లిం చారు. కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యు లు, నీటిపారుదల శాఖ అధికారులు గుణవంతరావు, ప్రభాకర్, మిషన్ భగీరథ అధి కారి సిద్ధిఖి, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.