11-06-2025 12:00:00 AM
మిర్యాలగూడ, జూన్ ౧౦: భూబకాసురుల భూదాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములు, గుట్టలు, అసైన్డ్ జాగాలను ఇప్పటికే ఖతం పట్టించిన భూ బకాసురులు ఆఖరికి కాల్వకట్టలను సైతం వదలడం లేదు. ఆ ఆదర్శ కాలువ కట్టని కబ్జా చేసి విలువైన భూమిగా మార్చేసి పొలంలో కలిపేసుకుంటున్నారు.
అయినా అధికారులు మాత్రం ఎలాంటి చలనం ఉండడం లేదు. వచ్చారుగడ్డ గ్రామం శివారు వేములపల్లి మండల రెవెన్యూ పరిధిలోగల కెనాల్ కాలువ కట్ట కబ్జాకు గురైంది. కట్ట చుట్టూ మట్టి పోసి కబ్జా చేశారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
కబ్జాకు గురైన కాల్వకట్ట భీమారం - సూర్యాపేట రహదారిని ఆనుకొని ఉంది. రహదారి వెంబడి కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులపై ప్రభుత్వ అధికారులకు పట్టింపు లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆదర్శ కాలువ కబ్జాను ఆపాలి..
వ్యవసాయ భూములకు కాలువలే ప్రధాన ఆధారం. వర్షబావ పరిస్థిలో బోర్లు పోసే అవకాశం లేదు గత 50 ఏళ్ల కింద ఏర్పాటుచేసిన కాల్వల ద్వారానే మా పొలాలకు నీరు అందుతుంది ఈ కాలువల ద్వారానే మేము సాగు చేసుకుంటున్నాం ప్రస్తుతం కొంతమంది కబ్జాదారులు కాలువలను కబ్జా చేస్తూ సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు దీంతో మా జీవన మనుగడ సాగే విధంగా లేదు అధికారులు స్పందించి కాలువలు కబ్జాకు గురి కాకుండా చూడాలి.
- రైతు నాగయ్య