11-06-2025 04:29:52 PM
నడిగూడెం: సహాయం అందించి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని జయ సీతారామ్ ఫౌండేషన్(Jaya Seetharama Foundation) వ్యవస్థాపక అధ్యక్షులు వల్లెపు శ్రీనివాస్ కోరారు. మండల కేంద్రానికి చెందిన పల్లపు సముద్రం కుమారుడు శ్రీను ఇటీవల అనారోగ్యంతో బాధపడుతుండగా వారి కుటుంబానికి బుధవారం 25 కేజీల బియ్యం, కిరాణా సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు మానవత్వం చాటుకోవాలని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు సహాయం అందించి చేయూతని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లపు తిరుమలేష్, గుంజ తిరుమలేష్, దేవరంగుల రాము, గుంజ మురళి, గుంజ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.