26 June, 2026 | 6:45 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి

02-04-2025 04:56 PM

మున్సిపల్ కమిషనర్ శ్రీహరి..

బాన్సువాడ (విజయక్రాంతి): రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. బాన్సువాడ మున్సిపాలిటీ సమీపంలో ఎండిపోయిన బోర్ వద్ద బోర్ చుట్టూ ఇంకుడు గుంతను ఏర్పాటు పనులను మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడు గుంతలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. రోజు రోజుకి నీటి అవసరాలు పెరుగుతుండడంతో  ప్రజలు బోరు మోటర్ల పై ఆధారపడుతున్నారని అన్నారు.

ఈ బోరు మోటర్ రీఛార్జి కావాలంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబం ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వర్షపు నీటిని ఒడిసి పట్టడానికి మున్సిపాలిటీ తరపున అనువుగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకుడు గుంతల వల్ల వృధాగా పోయే వర్షపు నీటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించి భూగర్భ జలాలను పెంపొందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, తుల శ్రీనివాస్, విట్టల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.