27-05-2025 12:12:32 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, మే 26 : పటాన్ చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ ఆర్థిక సహకారం అందిస్తున్నామని ఎమ్ముల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారం మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయం నిర్మాణానికి తన వంతు సహాయంగా ఎమ్మెల్యే రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు నూ.10లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాల కాలంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలు డివిజన్ల పరిధిలో సొంత నిధులతో 200 లకు పైగా దేవాలయాలు నిర్మించినట్లు తెలిపారు.
కార్యక్రమాల్లో జిన్నారం మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ హనుమంత్ రెడ్డి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, గ్రామ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బొల్లారం మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను రూ.60 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో ఆధునికరిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పాఠశాలలను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, చంద్రారెడ్డి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.