ఖానాపూర్ మండలంలో ఎక్సైజ్ అధికారుల దాడులు
02-05-2026 05:22 PM
నల్ల బెల్లం, నాటు సారా స్వాధీనం,
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో శనివారం ఉదయం ఎక్సైజ్ అధికారులు భారీగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నల్ల బెల్లం, నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు. దాడిలో 10 లీటర్ల నాటుసారా, 1900 లీటర్ల బెల్లం పానకం, 290 కిలోల నల్ల బెల్లం, 30 కిలోల అలం, స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.






