14-11-2025 12:39:51 AM
సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): రైస్ మిల్లర్ల దోపిడినీ ఆరికట్టాలని, రైతుల నుండి తరుగు పెడుతూ కొట్టివేసిన ధాన్యం మొత్తాన్ని రికవరీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో రైస్ మిల్లర్లు దోపిడీని అరికట్టాలని దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైస్ మిల్లర్లలో కొందరు అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని, వారి దోపిడిని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు సెంటర్లనుండి అదనంగా కొందరు రైస్ మిల్లు యజమానులు 5 నుండి 8 కిలోల వరకు రైతులు నుండి తరుగు పేరుతో రైస్ మిల్లర్లు సోమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్ నిర్వాహకులకు సైతం రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నార న్నారు.
రైస్ మిల్లర్లు వారి నుండి రికవరీ చేయాలని తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు వేగవంతం చేయాలని బోనస్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు బోనస్ డబ్బులు బోనస్ డబ్బులు ఇంకా జమ చేయలేదని వెంటనే వాటిని జమ చేయాలని డిమాండ్ చేశారు రైస్ మిల్లర్ల దోపిడిపై త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తీసుకెళ్తామని తెలిపారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు ముదాం అరుణ్ పాల్గొన్నారు.