calender_icon.png 18 February, 2026 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు సముచిత స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం

18-02-2026 08:14:05 PM

మునుగోడు,(విజయక్రాంతి): చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలలో జనరల్ స్థానాల్లో బీసీలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కట్టబెట్టడం శుభపరిణామమని బిసి నేతలు పానుగంటి విజయ్ గౌడ్, బూడిద మల్లికార్జున్ యాదవ్ పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి బిసి యువజన సంఘం నాయకులు అభినందనలు తెలిపి మాట్లాడారు.

బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించడంలో ఇది ఒక మంచి ముందడుగు అని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికీ బడుగు, బలహీన వర్గాలు,పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని, అన్ని వర్గాల అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు.యావత్ బిసి సమాజం తరఫున ఎమ్మెల్యే  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.