సీపీఎం నుంచి బహిష్కరణ
05-03-2026 12:12 AM
పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
మోతె, మార్చి 4: సిపిఎం పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగించేలా అనైతిక చర్యకు పాల్పడిన సిపిఎం పార్టీ మోతె మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డిని సిపిఎం పార్టీనుండి బహిష్కరిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుండి ఆయనకు సిపిఎం పార్టీకి ఎలాంటి సంబంధం లేదనీ పేర్కొన్నారు. ఆయన పాల్పడిన అనైతిక చర్య వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలిగినట్టుగా భావిస్తు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.




