09-06-2025 02:32:12 AM
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ఫసాడ్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వా టి వెలుగులతో చారిత్రక కట్టడాలకు నూతన శోభను తీసుకువచ్చి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ద్వారా ఆయా కట్టడాల ప్రాముఖ్య తను గురించి తెలుసుకునేలా చేస్తున్న కేంద్ర పర్యాటక శాఖ.. తాజాగా ఆ సొబగులను కాచిగూడకు తీసుకొచ్చింది.
ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న కాచిగూడ రైల్వేస్టేషన్కు రూ.2.23 కోట్ల వ్యయంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఫసాడ్ లైటిం గ్ వ్యవస్థను సోమవారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించనున్నారు. నిజాం ఏలుబ డిలో 1916 లో గోథిక్ శైలిలో కాచిగూడ రైల్వేస్టేషన్ను నిర్మించారు.
ఈ రైల్వేస్టేషన్కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, అద్భుతమైన నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా చూపించడానికి మొత్తం 785 ఇల్యుమినేషన్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇకపై ఈ ఇల్యుమినేషన్ లైట్ల వెలుగులో కాచిగూడ రైల్వేస్టేషన్ బిల్డింగ్ ఎంతో చూడముచ్చటగా కనిపించనుంది. నగరం మధ్యలో ప్రజలకు అందుబా టులో ఉన్న ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు.
ఎనర్జీ ఎఫీషియంట్ స్టేషన్..
కాచిగూడ రైల్వేస్టేషన్ చారిత్రక నేపథ్యం కలిగి ఉండటమే కాకుండా గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకుంటూ పర్యావరణ పరిరక్షణలో కూడా తనవంతు పాత్రను పోషిస్తోంది. గ్రీన్ రైల్వే స్టేషన్లకు రేటింగ్ ఇచ్చే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా కాచిగూడ రైల్వేస్టేషన్కు ప్లాటినమ్ రేటింగ్ లభించింది. రైల్వే లలో ఎనర్జీ ఎఫిషియెంట్ స్టేషన్గా కాచిగూ డ రైల్వేస్టేషన్ నిలిచింది.
రైల్వేలలో మొట్టమొదటి డిజిటల్ పేమెంట్ సేవలను కాచిగూడ రైల్వేస్టేషన్లోనే ప్రారంభించారు. ఇలా ఎన్నో రకాలుగారకాలుగా ప్రాముఖ్యతను సంతరించుకున్న కాచిగూడ రైల్వేస్టేషన్ ను రూ.421.66 కోట్లతో అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేస్తున్నారు.