18-06-2025 07:49:24 PM
ఘట్ కేసర్: అనురాగ్ విశ్వవిద్యాలయం(Anurag University)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బుధవారం ఐదు రోజుల ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(Faculty Development Program)లో భాగంగా "బ్లాక్చెయిన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చన మంత్రి, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ వి. విజయ్ కుమార్, డాక్టర్ నితీషా శర్మ, డాక్టర్ ప్రశాంత రావు, డాక్టర్ ఆనంద్ బాబు పాల్గొన్నారు.
మొదటి కార్యక్రమంలో స్పీకర్ మిస్టర్ బాలప్రసాద్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, ఎంటి యూనిట్, టిసిఎస్, బ్లాక్ చైన్ ఇంపార్టెంట్, విద్యార్థులకు దానిని ఏవిధంగా బోధించాలో నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనురాగ్ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ, ఇతర కాలేజీల్లోని ఫ్యాకల్టీ హైబ్రిడ్ మోడ్ లో 200 వందలకు పైగా హాజరు కావడం జరిగింది.