02-06-2025 01:18:05 AM
షాద్ నగర్, జూన్ 1: షాద్ నగర్ పట్టణంలో రూ.7.5 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ ఎస్ఓటి ఎస్త్స్ర ధనుంజ య, స్థానిక ఎస్త్స్ర శరత్, వ్యవసాయ శాఖ ఇన్చార్జ్ ఏడి నిశాంత్ కుమార్ సంయుక్తంగా షాద్ నగర్ పట్టణంలో ని పరిగి రోడ్డు బకర్మన్ గార్డెన్ సమీపంలో నిషేధిత న కిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం అం దింది.
దీంతో అధికారులు అంతా అక్కడికి చేరుకొని అనుమానాస్పదంగా నిలిపి ఉన్న హోండా మొబిలి యో ఏపీ 03 బిఏల్ 5204 నంబరు గల వాహనాన్ని తనిఖీ చేశారు.అందులో 300 కిలోల నిషేధించిన ప త్తి విత్తనాలను గుర్తించినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు. వీర వసంత రావు అనే వ్యక్తి అమరావతి మం డలం పల్నాడు జిల్లా నుండి చంద్రలపాడు గ్రామము, ఎన్టీఆర్ జిల్లా కు చెందిన జంపాని నాగేశ్వర్ రావు పరిగి పట్టణంలో నివాసమంటూ వికారాబాద్ మండలం ధ్యా చెర్ల గ్రామములో పొలం కౌలుకు తీసుకోని వ్యవసాయం చేస్తున్నాడు.
అట్టి పొలంలో నిషేదిత పత్తి విత్తనాలను సాగు చేస్తూ మరో పక్క రైతులకు గుర్తుచప్పు డు కాకుండా షాద్ నగర్ లోని పరిగి రోడ్ లో గల బక్కర్మన్ గార్డెన్ సమీపంలో నిషేదిత పత్తి విత్తనాలను విక్రయిస్తున్నాడు. ముగ్గురు రైతులకు నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తుండగా పోలీసు మరియు వ్యవసా య శాఖ అధికారులు సమీక్షంగా దాడి చేసి పట్టుకున్నారు. ఇట్టి తనిఖీలో షాద్ నగర్ ఇన్చార్జ్ ఏడి అగ్రి కల్చర్ నిశాంత్ కుమార్, ఫరూక్ నగర్ వ్యవసాయ విస్తరణ అధికారి తేజ్ కుమార్, ఎస్త్స్ర శరత్, మేడ్చల్ ఎస్ఓటి ఎస్త్స్ర ధనుంజయ లు పాల్గొన్నారు.