16-06-2025 12:37:34 AM
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు పార్టీ నేతలపై రాష్ట్రప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తున్నదని, గాంధీభవన్ వేదికగానే వారిపై ఎఫ్ఐఆర్లు సిద్ధం చేస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మాట్లాడారు. కేటీఆర్పై ఇప్పటివరకు ప్రభుత్వం 14 తప్పుడు కేసులు బనాయించిందని ధ్వజమెత్తారు. కేటీఆర్ ఫార్ములా ఈ రేసును ధైర్యంగా ఎదుర్కొంటారన్నా రు.
ఇప్పటికే న్యాయస్థానాలు కేటీఆర్పై బనాయించిన నాలుగు కేసులు కొట్టివేసిందని, ఈ కేసులోనూ కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. ఎంతోమంది పోలీసు అధికారులు చట్టప్రకారం నడచుకోవడం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో సీఎం లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమం టే, తాను కూడా ఈరేసు కేసులో ఆ పరీక్షలకు సిద్ధమని సవాల్ విసిరారని, సీఎం ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు.