10-06-2025 08:43:09 PM
రానున్న ఎన్నికల్లో నీలీ జెండాను ఎగరేస్తాం బహుజన రాజ్యాన్ని సాధిస్తాం..
బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల కమిటీ..
చర్ల (విజయక్రాంతి): మండల కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు కొండా చరణ్ ఆధ్వర్యంలో పలు గ్రామాల నుండి 26 కుటుంబాలు బీఎస్పీ పార్టీ(Bahujan Samaj Party)లో నియోజకవర్గ ఇన్చార్జి సామల ప్రవీణ్, చర్ల మండల పార్టీ ఇన్చార్జి చల్లగుండ్ల సతీష్ చౌదరీల సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా సామల ప్రవీణ్, చల్లగుండ్ల సతీష్ చౌదరిలు మాట్లాడుతూ... పార్టీలో పనిచేసేందుకు బీఎస్పీ తరుపున వారికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ కండువా కప్పి 26 కుటుంబాలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీలో చేరడం వీరి చైతన్యానికి నిదర్శనం అన్నారు.
ఈ ప్రాంతంలో బహుజన ఉద్యమం బలపడుతుందని అందుకు ఈ చేరికలే నిదర్శనం అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మతమైనారిటీల ఐక్యత రోజురోజుకు పెరుగుతుందని చర్ల మండల నాయకత్వం అందుకోసం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో చర్ల గడ్డపై నీలి జెండా కచ్చితంగా ఎగురుతుందని త్వరలోనే ఈ ప్రాంతంలో బహుజనులు రాజ్యాధికారం తప్పకుండా సాధిస్తారని అన్నారు, చేరీకలు చేయడంలో మండల కమిటీ చేసిన కృషి అద్భుతం అని తెలిపారు.
పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ నాయకత్వాన్ని నమ్మి పార్టీలోకి వచ్చిన ఈ కుటుంబాలకు పార్టీ నిరంతరం అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కొండా చరణ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చెన్నం మోహన్ పార్టీ మండల కోశాధికారి పంబి కుమారీ పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ పార్టీ ఈసీ మెంబర్ గుర్రాల విజయ్ కుమార్ పార్టీ కుదునూరు సెక్టార్ ప్రెసిడెంట్ పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.