calender_icon.png 18 June, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2 వ రోజు 3ఎకరాలలోపు.. రైతుభరోసా

18-06-2025 12:40:49 AM

  1. రైతుల ఖాతాల్లోకి రూ.1551.89 కోట్లు
  2. 10.45లక్షల మంది రైతులు..25.86 లక్షల ఎకరాలు 
  3. ఎకరాలతో సంబంధం లేకుండానే రైతుభరోసా: మంత్రి తుమ్మల

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతాంగానికి పెట్టు బడి సాయం కింద రైతు భరోసా నిధులను బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. మొదటిరోజు 2 ఎకరాల వరకు జమ చేసిన ప్రభుత్వం రెండోరోజు మంగళవారం మూడు ఎకరాల వరకు రైతుభరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున జమ చేసింది.

రెండోరోజు 10.45లక్షల మంది రైతులకు సంబంధించి 25.86లక్షల ఎకరాలకుగాను  రూ.1,551.89 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొదటిరోజు 2 ఎకరాల భూమి ఉన్న 41.24లక్షల మంది రైతులకు సంబంధించి 39.16లక్షల ఎకరా లకు గాను రూ.2,349.83కోట్లను ప్రభు త్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

దీంతో రెండు రోజుల్లో మొత్తం 49.61  లక్షల మంది రైతులకు గాను రూ. 3,901.72 లక్షలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.  ఎకరాలతో సంబంధం లేకుండా త్వరలోనే మిగతా రైతులకు కూడా రైతుభరోసా అందుతుందని, ఎవ రూ నిరాశ పడాల్సిన అవసరం లేద ని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

బ్యాంకులతో ఎలాంటి చిక్కులు లేకుండా రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపా రు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్ర భుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.