18-06-2025 12:40:09 AM
రంగారెడ్డి, జూన్ 17 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలపై పల్లెల్లో చర్చ మొదలైంది. వచ్చే నెలలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయని అందుకు అంతా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి హింట్ ఇచ్చారు. ఇన్చార్జి మంత్రులంతా జిల్లాల వారీగా ఎన్నికలపై దృష్టి చారించాలని, మెజార్టీ సీట్లు సాధించడంతో పాటు ఏకగ్రీవాలపై దృష్టి పెట్టాలని ఇప్పటికే మంత్రులకు ఆయన స్పష్టం చేశారు.
సీఎం ప్రకటనతో దీంతో పల్లెల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది.గత వారం రోజుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వరుసగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సైతం ప్రకటనలు ప్రకటనలు ఇచ్చారు. దానికి తోడు రెండు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేయడంతో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ర్ట ప్రభుత్వం అప్పుడా ఇప్పుడు అంటూ దాటవేస్తూ వస్తుంది. దీంతో ఎన్నికల బరిలో నిలబడే ఆశావావులంతా నిరాశలో కోరుకుపోయారు.. మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలపై ప్రకటన చేయడంతో వారిలో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఏడాదిన్నరగా ప్రత్యేక పాలన
స్థానిక సంస్థల ఎన్నికల గడువు గతేడాది 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. ఇటీవలనే మున్సిపాలిటీ పాలకవర్గం గడువు కూడా తీరిపోయింది. అప్పటి నుంచి రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక పాలన కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని అంతా మొదలు భావించారు. ప్రభుత్వం ఎన్నికల సంఘం కూడా అందుకు సర్వం సిద్ధం చేసుకుంది.
ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సులు ఏర్పాటుతోపాటు పోలింగ్ బూత్ లపై సమావేశాలను సైతం నిర్వహించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన కుల గణన తదితర సమస్యల కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ప్రత్యేక పాలనలో పల్లెల్లో కూనరిల్లుతూ ఉన్నాయి.
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక పంచాయతీల నిర్వహణ భారం అంతా పంచాయతీ కార్యదర్శులపై పడింది. దీంతో ములిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా పంచాయతీ కార్యదర్శులు పరిస్థితి మారింది. అప్పులు చేసి పంచాయతీ పాలన కొనసాగిస్తూ వచ్చారు. ఇటీవలనే పంచాయతీలో ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది అంటూ డీజిల్ నిర్వహణకు పైసలు తేలేకపోతున్నామంటూ ట్రాక్టర్ల మెయింటెనెన్స్ చేయలేకపోతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తూ... రాష్ర్ట వ్యాప్తంగా నిరసనకు సైతం దిగారు.
మరోపక్క పంచాయతీలో పాలకవర్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రస్తుతం వర్షాకాల సీజన్ కావడంతో పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ కూడా కురువైంది. పంచాయతీ ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టిన నుంచి పంచాయతీల వైపు కన్నెత్తి చూడడం లేదు.
దానికి తోడు వారికి ప్రభుత్వం బాధ్యతలు అప్పజెప్పిందే గాని పైసా విధాల్చలేదు.దీంతో ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ పడకెక్కింది. జిల్లాలో మొత్తం 21 మండలాలు 531 పంచాయతీలు ఉండగా ఇటీవలనే చేవెళ్ల మోయినాబాద్ మున్సిపాలిలో ఐదు పంచాయతీలు విలీనం చేశారు... కానీ అధికా రికంగా ప్రభుత్వం జీవో జరీచేయలేదు.
రిజర్వేషన్లపై సర్వత్రాసక్తి
ఇప్పటి అందరి మెదడులో తోలుస్తున్న ప్రశ్న.... ఇంతకీ రిజర్వేషన్లు మారుతాయా మారవా? గత ప్రభుత్వంలో అమలు చేసిన రిజర్వేషన్లే ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా? అంటూ ఒకటే చర్చ మొదలైంది. జిల్లా అధికారుల మొదలుకొని మండల అధికారుల వరకు స్థానిక సంస్థల బరిలో ఉండే ఆశావావులంతా అధికారులకు ఫోన్లు చేసి.. వ్యక్తిగతంగా కలిసి రిజర్వేషన్ల అంశంపై ఆరా తీస్తున్నారు.
గత ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లపై పదేళ్లు చట్టం చేస్తూ జీవో జారీ చేసింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ రిజర్వేషన్లు కొనసాగిస్తుందా...గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై.... అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది. దీనిపైనే పల్లెల్లో తీవ్ర చర్చలు సాగుతున్నాయి. మరోపక్క బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎలా ముందుకు పోతుందని.... స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటూ ఇప్పటికి అధికార ప్రభుత్వం ప్రకటన చేసింది.
ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ బిల్లు అంశం రాష్ర్టపతి పరిధిలో ఉంది. రిజర్వేషన్ల బిల్లుపై తుది నిర్ణయం రాష్ర్టపతి దే. రాజ్యాంగ నిబంధన ప్రకారం బిల్లు పాస్ కావాలంటే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది....సో ఇది ఇప్పుడు తేలే అంశం కాదు.... కానీ... అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం ఆగేలా లేదు. దీంతో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు అందరి దృష్టి ప్రభుత్వం పై పడింది.
మరోపక్క ఆశావాహులు ఎన్నికల బరిలో నిలిచేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం మంత్రులు,ఎమ్మెల్యేలకు స్థానిక ఎన్నికలపై రెడీగా ఉండాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే తమ పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహించి సర్వం సిద్ధంగా ఉండాలని క్యాడర్ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
మరోపక్క కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో మరింత పట్టు నిలబెట్టుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలే మంచి అవకాశం గా భావిస్తున్నారు. భవిష్యత్తులో తమకు అనుకూలంగా ఉండే వారిని తమ క్యాడర్ను పంచాయితీల వారిగా బరిలో నిలిపేలా ఎత్తుగడలు వేస్తున్నారు. పార్టీపై, క్యాడర్ పై పూర్తి పట్టు నిలుపుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలో కొంత జోష్ కనబడుతున్న....
ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్, బిజెపిలో కొంత నిరుత్సాహం గా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే పైసలతో ముడిపడే అంశం. అధికార పార్టీ అయితే బరిలో నిలబడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదని.... ప్రతిపక్ష పార్టీలో ఉండి ఎన్నికల బరిలో నిలిచి గెలిస్తే ఇబ్బంది ఉండదు... కానీ ఓడితే.... కొంత ఆర్థిక సమస్యలు చుట్టుముట్టుతాయని కొంత వెనుకడుగు వేస్తున్నారు.
చూడాలి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల ఎన్నికల యుద్ధం త్వరలో ప్రారంభం కానుంది. విజయం మీదా.... మాదా అంటూ ఎన్నికలకు ఆయా పార్టీ నేతలంతా సర్వం సిద్ధం అవుతున్నారు.