4 ఎకరాల వరకు రైతుభరోసా
- రూ.1,313.53కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ
- -- 21.89 లక్షలు..6.33లక్షల మంది రైతులకు లబ్ధి
- ఇప్పటివరకు 58.04లక్షల మంది.. రూ.5,215.26కోట్లు విడుదల
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతాంగానికి రైతు భరోసా కింద 4 ఎకరాల వరకు రూ. 1,313.53కోట్లను బుధవారం వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 21.89లక్షల ఎకరాలకుగాను 6.33లక్షల మంది రైతులు లబ్ధి పొందారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 58.04 లక్షల మంది రైతులకు గాను రూ. 5,215.26 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.
9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతులు ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేశామని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో ఒక సందర్భంలో మినహా వానాకాలం రైతు బంధు సాయం ఎప్పుడు కూడా సాగుకాలానికి ముం దు ఇవ్వలేదని, ప్రతి ఏటా ఆలస్యంగానే నిధులు విడుదలయ్యేవని, అది కూడా పదో నెల వరకు కొనసాగేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్క సందర్భంలోనూ 3 రోజుల్లో రూ. 5వేలకోట్లకు పైగా రైతుబంధు కోసం ఖర్చుపెట్టిన దాఖలాలు లేవన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రైతుల సంక్షేమం కోసం రూ. 77,000 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.






