19-06-2025 12:32:36 AM
తాగునీటి సమస్యతో సతమతం
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 18 ,(విజయ క్రాంతి) ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని, విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తు న్నామంటూ పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధం గా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నడానికి పాల్వంచ పట్టణంలోనీ బొల్లోరుగూడెం లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అద్దం ప డుతోంది.
1 వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధన నిర్వహిస్తున్న సరస్వతీ నిలయంలో సమస్యలు తీష్ట వేశాయి. 55 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులకు త్రాగడానికి తాగునీరు లేదంటే అతిశయోక్తి కాదు. విద్యార్థుల కు మధ్యాహ్న భోజనం తయారు చేయాల న్న, పిల్లల గొంతు తడపాలన్న నీటిని వెతు పోవాల్సిందే. ఈ పాఠశాలకు తాగునీటి పైపులను సౌకర్యం కల్పించలేదంటే అధికారుల, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి ఏ పార్టీదో తేటతెల్లమవుతుంది.
పాఠశాల చుట్టూ ఉన్న వా తావరణం విద్యార్థులకు చదువుకొనే ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది. ఒకవైపు టిటిడి కళ్యాణ మండపం, మరోవైపు పబ్లిక్ పార్క్, పాఠశాల ఆవరణలోనే బిసి బాలుర వసతిగృహం ఉన్నాయి. వీటికి తోడు కూలిపోయి న ప్రహరీ గోడ కారణంగా చీకటి పడితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది.
పాఠశాల ఆవరణలో బో ర్లు ఉన్నప్పటికీ ఆ నీళ్లు తాగేందుకు అనువు గా లేకపోవడంతో విద్యార్థులు తాకునేటి స మస్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బీసీ వసతి గృహంలో గల పంపు నుంచి నీటిని తీసుకువచ్చి వంట వార్పు చేయడంతో పాటు, పిల్లల గొంతులు తడుపుతున్నారు. పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ఈ పాఠశాలకు వర్తించలేదంటే అధికారుల పర్యవేక్షణ లేమికి అడ్డం పడుతుంది.
కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్నామంటున్న అధికారులు, పాలకులు తమ దృష్టిని ఏ పాఠశాలపైకి మళ్ళిం చాలని విద్యార్థి తల్లిదండ్రులు, స్థానిక ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు. విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ను వివ రణ కోరగా అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు తమ పాఠశాలకు మంజూరు కాలేదని, పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.