10-06-2025 11:21:18 PM
చిన్నశంకరంపేట/చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) చిన్నశంకరంపెట్ మండల పరిధిలోని మిర్జాపల్లి, గ్రామ శివారులో చెట్టుపై నుండి జారి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. కుటుంబీకులు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... నార్సింగి మండలం శేరిపల్లికి, గ్రామానికి చెందిన మల్లేశం(42) మిర్జాపల్లిలో తనకున్న వ్యవసాయ పొలంలోకి వెళ్లగా, రాత్రి వరకు ఇంటికి రాకాపోగా కుటుంబీకులు తన పొలంలో ఉన్న టేకు, చెట్టు, కొమ్మలను కొడుతుండగా పైనుండి జారి కిందపడి మృతి చెందాడని తెలిపారు. మంగళవారం పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించగా భార్య లక్ష్మి నర్సవ్వ ఫిర్యాదు మేరకు శంకరంపెట్, ఎస్సై నారాయణ గౌడ్, ఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.