నిర్మల్లో గాలివాన బీభత్సం
- నేలకూలిన వందల ఏళ్ల నాటి వేపచెట్టు
- పలు కాలనీల్లో గాలికి ఎగిరిపోయిన రేకుల షెడ్లు
నిర్మల్, జూన్ 10 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం జనాన్ని అతలాకుతలం చేసింది. రాత్రి పది గంటల నుంచి 11 గంటల వరకు బలమైన గాలులతో పాటు వర్షం భారీగా కురవడంతో నిర్మల్ పట్టణం మొత్తం జలమయమైంది. బలమైన గాలుల వల్ల పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద వందల ఏళ్లనాటి వేప చెట్టు కూలిపోయింది.
బ్రహ్మపురిలో 120 ఏళ్ల రాగి చెట్టు కొమ్మలు విరిగిపడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురై, ఇళ్లనుంచి పరుగులు తీశారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బలమైన గాలులు వీయడంతో రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. శాంతినగర్ ఆదర్శనగర్ గాజులపేట్ తతర కాలనీలో రేకుల షెడ్లు లేచిపోయాయి. ఓ వృక్షం ఆటోపై పడటంతో ఆటోనుజుగా అందులో ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి.
ఇదిలా ఉండగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్ పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది మున్సిపల్ సిబ్బంది విరిగిపోయిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశారు. సహాయక చర్యలు నిర్మల్ జిల్లాకు చెందిన శివంగి మహిళా టీం సభ్యులు విరిగిన చెట్ల కొమ్మలను తొలగించారు.






