09-06-2025 12:00:00 AM
టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ
మంచిర్యాల, జూన్ 8 (విజయక్రాంతి) : ప్రజా సమస్యలను నాయకులకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ ఎప్పుడూ ముందుండేవారని, ఆయన పీడిత ప్రజల కోసం పరి తపించిన మనిషి అని టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు.
మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎండి మునీర్ సంస్మరణ సభను ఆదివారం బస్టాండు సమీపంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి మాట్లాడారు. ఎండీ మునీర్ ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగానే కాకుండా ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారని మునీరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
చిన్న నాటి నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే వారని, పీడిత అణగారిన వర్గాల ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నా రు. సింగరేణి ఉద్యోగిగా, జర్నలిస్టుగా పనిచేస్తూ బొగ్గు బావుల్లో సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కరించడంలో ముందుండేవారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సకల జను ల సమ్మెలో 55 రోజుల పాటు సింగరేణి కార్మిక సమ్మెకు జేఏసీ చైర్మన్గా మునీర్ వ్యవహరించి కార్మిక సంఘాలను, కార్మికులను, అధికారులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమానికి అండగా నిలిచారన్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. భౌతికంగా మన మధ్య లేకున్నా సింగరేణి ఉన్నం త వరకు మునీర్ ఉంటారన్నారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143 నాయకులు మారుతి సాగర్, యోగానంద్, ఇఫ్టూ జాతీయ నాయకులు శ్రీనివాస్, పీవోడబ్ల్యూ నాయకురాలు మంగా, న్యూ డెమో క్రసీ నాయకుడు లాల్ కుమార్, యూనియ న్ జిల్లా కన్వీనర్ ఉమేష్, కో కన్వీనర్లు రమే ష్, శ్రీనివాస్, మునీర్ సోదరుడు సందాని, కుమారుడు మయూర్ పాల్గొన్నారు.