వారబంధితో రైతుల గోస
తుంగతుర్తి,ఫిబ్రవరి 6: వారబంధీ పద్దతిలో ఎస్సారెస్పీ జలాలు ప్రధాన కాలువల ద్వారా వస్తున్నప్పటికీ చివరి వరుస పోలాలకు నీరు అందక పోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన కాల్వలకు కొంతమంది రైతులు రాత్రి వేళల్లో ఎక్కడపడితే అక్కడ గండ్లు పెట్టడం, మరి కొంతమంది రైతులు తమ తోటలకు ప్రత్యేక కాలువలు తీసి ఇష్టానుసారంగ నీటిని వాడుతుండటంతో వాడుతున్నారు.
ఈ సీజన్లో వారాబంది ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు చెరువులు, కుంటలు, చివరి భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందలేదు. ఐబీ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా చివరి పోలాలకు నీరు చేరడం లేదు. సాగునీరు అందకపోవడం పంట నష్ట పోతామని, తక్షణమే ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి చివరి భూములకు కాలువ నీళ్ళు అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.






