15 June, 2026 | 2:00 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

కాంగ్రెస్ అసమర్థత పాలనతోనే రైతులకు ఇబ్బందులు

23-10-2025 04:20 PM

వలిగొండ (విజయక్రాంతి): కాంగ్రెస్ అసమర్థత పాలనతోనే రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు గురువారం వలిగొండ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల కాలంలో రైతులకు ఇచ్చినటువంటి ఎలాంటి హామీలను నెరవేర్చలేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో కల్లాలలో, ఐకెపి సెంటర్లో ధాన్యం తడిసిపోయిందన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని అన్నారు.  అదేవిధంగా పత్తి రైతులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని లేని యెడల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.