5 March, 2026 | 7:15 PM

విద్యార్థినులు,మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

05-03-2026 05:57 PM

 సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు.

ర్యాగింగ్,ఇవిటీజింగ్,పోక్సో యాక్ట్ /లైంగిక వేధింపులపై అవగాహన.

మహిళలను వేధిస్తున్న పోకిరీలపై ఫిబ్రవరి నెలలో 04 కేసులు,06 పెట్టి కేసులు నమోదు.

మహిళలు,విద్యార్థినిలు వేధింపులకు గురైతే షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో చట్టపరమైన చర్యలు. 

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం విద్యాసంస్థల్లో,మహిళలు పని చేసే ప్రదేశాల్లో ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 04 ఎఫ్ఐఆర్లు,06 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.విద్యార్థినులు, మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని, మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు, బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో  అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనేజిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ  తెలిపారు.