25-06-2025 12:37:27 AM
గద్వాల టౌన్, జూన్ 24 : రెవిన్యూ సదస్సు ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తు కు ఆగస్టు 15 నాటికి పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సి.ఎస్ కే.రామ కృష్ణా రావు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణా రావు సమీక్ష నిర్వహించారు.
ఆన్ లైన్ నుంచి అటవీ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కోండా సురేఖ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, 5,585 దరఖాస్తులను భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీక రిం చామని, 4,588 దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసి 111 దరఖాస్తులకు నోటీసులు జారీ చేశామని అన్నారు.సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు.
పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ గృహాల కింద జిల్లాలో 7 వేలకు గాను 6,488 దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని, ఇందులో 1850 మందికి మంజూరు ఉత్తర్వులు అందించడం జరిగిందని అన్నారు.153 బేస్మెంట్ లెవెల్, 07 రూఫ్ లెవెల్, 01 స్లాబ్ లెవెల్ పనులకు డబ్బులు చెల్లించినట్లు తెలియజేశారు.
మిగతా పనులన్నీ పురోగతిలో ఉన్నట్లు ఆయన సీఎస్ కు తెలియజేశారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్డీవో అలివేలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, హౌసింగ్ పిడి కాశీనాథ్, ఫారెస్ట్ రేంజ్ అధికారి పర్వేజ్ అహ్మద్, హార్టికల్చర్ అధికారి అక్బర్ బాషా, జిల్లా వైద్యాధికారి సిద్ధప్ప, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రమేష్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.