16 April, 2026 | 9:06 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

శిశు మందిర్లో రైతు దినోత్సవం

23-12-2025 04:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): స్థానిక పాఠశాల అయినా శ్రీ సరస్వతి శిశు మందిర్ బుధవారపేట్ పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవం  మంగళవారం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వ్యవసాయ పనుల వేషధారణ పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముక అన్నారు.

ప్రధానాచార్యులు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. అన్నాన్ని వృధా చేయకూడదని అలా వృధా చేసినట్లయితే భవిష్యత్తులో ధాన్యాల కొరత ఏర్పడుతుందని తెలియజేశారు. రైతులు పడే కష్టాలు పంటలు పండించే విధానాలను గురించి తెలియజేశారు. తదనంతరం విద్యార్థులు వారి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆచార్యులు, పాల్గొన్నారని పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేష్ తెలియజేశారు.