calender_icon.png 23 December, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలను పరిశీలించిన ప్రత్యేక అధికారి

23-12-2025 03:54:05 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): జిల్లాలోని యాస్పిరేషనల్ బ్లాక్ అయిన పెంబి మండలంలోని నాగపూర్ ప్రాథమిక పాఠశాల, పెంబి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని నీతి అయోగ్ ప్రత్యేక అధికారిని శ్రీమతి శిల్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ దర్శనం భోజన్నతో కలిసి సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆమె కేజీబీవీ లోని చదువుతున్న బాలికలకు కల్పిస్తున్న సదుపాయాలు మరియు వారి యొక్క విద్యా ప్రగతిని స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి, వారి సమాధానాల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యాస్పిరేషనల్ బ్లాక్ అయిన  పెంబి మండలంలోని పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.