25-06-2025 07:25:01 PM
రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత...
హుజురాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి అని మరోసారి రుజువు చేసుకుంది. గతంలో వరి వేస్తేనే ఉరి అనే విధంగా ఉండేది. కానీ ఈరోజు దండగ కాదు పండగ అని రైతు కళ్ళల్లో ఆనందం నింపిన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల పుష్పలత(Congress Urban Women President Vemula Pushpalatha) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇచ్చిన హామీల ప్రకారం సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పున అన్ని వ్యవసాయ భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రైతు భరోసా ఈరోజు వరకు తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందన్నారు.
రైతులు ఎంతో సంతోషంగా పండగ వాతావరణం చేసుకోవడం రైతుల కళ్ళల్లో ఆనందం నింపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు ఒక కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో చూసినట్లయితే ఎన్నడూ రైతు భరోసా వేసిన దాఖలాలు లేవు. ఇటువంటి పండుగ వాతావరణాన్ని ఏర్పర్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కి జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణకి, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.