14-06-2025 01:04:36 AM
సదాశివపేట: సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలో శుక్రవారం భూ భారతి రెవిన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది, గ్రామంలో ఎలాంటి భూ సంబంధిత సమస్యలు ఉన్నా కూడా రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు తీసుకొని వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. భూభారతి ద్వారా రైతులకు ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఈ చట్టం పనిచేస్తుంది అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భూ సమస్యలు ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొల్కూర్ గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.