14-06-2025 01:04:26 AM
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థులకు గురుకులాల తరహా సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశంపై యంత్రాంగం పూర్తిగా అధ్యయనం చేసి భవిష్యత్తులో అమలు చేస్తుందని స్పష్టం చేశా రు.
పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో విద్యా శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో సీఎం మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు అందిస్తుండటంతో గురుకులా ల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారని, డే స్కాలర్స్ కూడా సర్కార్ పాఠశాలల్లో అవన్నీ అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమన్నారు. 20మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో నైపుణ్యాలు వృద్ధి చెందితేనే, భవిష్యత్తులో వారు తమకిష్టమైన రంగంలో రాణిస్తారని అభిప్రాయపడ్డారు. రా ష్ట్రంలో వేగంగా పట్టణీకరణ సాగుతున్నదని, ఈ నేపథ్యంలో విద్యా శాఖ ఇతరశాఖలను సమన్వయం చేసుకొని మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతులకు సేకరించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చే యాలని ఆదేశించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం పా ఠ్యాంశాలే కాకుండా, కుటుంబం, సామాజిక జీవితంపైనా అవగాహన కల్పించాలని సూచించారు. సమాజంలో రేపటి తరం పాత్రను కూడా వివరిస్తే, వారు మానసికంగా దృఢం గా తయారవుతారని ఆకాంక్షించారు. ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా యాజమాన్యాలు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్పై దృష్టి సారించాలని సూచిం చారు.
సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్రప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య, సాంకేతిక విద్యాక మిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.