calender_icon.png 16 June, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల భూ సమస్యలు భూ భారతితో పరిష్కారం

16-06-2025 02:00:43 PM

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలో రైతుల భూ  సమస్యలు  భూ భారతి తో పరిష్కారం అవుతాయని ముత్తారం తాసిల్దార్ మధుసూదన్ రెడ్డి(Muttharam Tehsildar Madhusudhan Reddy) అన్నారు. సోమవారం మండలంలోని కేశనపల్లి, సీతంపేట గ్రామాలలో  భూ  భారతి రెవెన్యూ సదస్సులు(Bhu Bharathi Revenue Conferences) నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల  భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి 2025 ఆర్ఓఆర్ చట్టం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో రైతులు తమ సమస్యలను రాతపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని తాసిల్దార్ రైతులను కోరారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులను పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో సీతంపేట డిటి తో పాటు ఆర్ ఐ శ్రీధర్,  రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.